(అంశము::”కొసమెరుపు కథలు”)
మాయమాటలు
రచన: కవితదాస్యం
ఒకనాడు గురువుగారికి శిష్యుల పై కోపం వచ్చి “ఎక్కడికైనా పోయి చా వండి రా! అని కసిరి గొట్టాడు. శిష్యులు చేసేది లేక ఊరి చివరకు పోయారు. చెరువులో నీరు త్రాగి దాహం తీర్చుకుని తమ కర్తవ్యం గురించి ఆలోచించసాగారు.
ఇంతలో ఒక తుంటరి ఏంటి పంతుళ్ళు! ఇక్కడున్నారు రరామయ్య దయ్యమై ఊరి పొలిమేరల్లో తిరుగుతున్నాడట. ఇక్కడకు రాకండి పారిపోండి. అని భయపెట్టాడు.
ఆ మాటలు విన్న వెంటనే శిష్యుల మొహాల మీద నెత్తురు చుక్కలేదు. నిశ్చేష్టులయ్యారు.
భయంతో అటు ఇటు పరిగెత్తి మరల అక్కడికే వచ్చి ఒరేయ్ మనం ఎందుకు పరిగెడుతు న్నాము రా అని ఆలోచించుకొని కొంతసేపటికి మరల బెంబేలు పడుతూ జ్ఞాపకం వచ్చింది.
రామయ్య దయ్యమై మనల్ని పట్టి బాధించడం తథ్యం. అనుకొని తలో దారి పారిపోయారు. అలావారు పారిపోయి పరమానంద పురాన్ని చేరుకున్నారు.
అక్కడ మధూకర వృత్తిని చేపట్టి దిక్కులేని పక్షుల్లా జీవించసాగారు. గురువుగారికి ఇంతలో మరలా శిష్యుల పై ధ్యాస మళ్లింది. వెర్రి కుంకలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో, అని బెంగ పెట్టుకొని వెతక నారంభిస్తాడు. కొంతకాలానికి శిష్యుల జాడ తెలిసింది. రమ్మని కబురుపెట్టారు. కానీ వారు రామయ్య దయ్యమై తిరుగుతున్నారు. మమ్మల్ని చంపేస్తారు. మేము రాము అని బదులు పంపారు. గురువు గారు శిష్యులను సమాధాన పరిచి వెనక్కి పిలిపించారు. గురువుగారు పంపిన వ్యక్తితో శిష్యులందరూ తిరిగి వచ్చి బుద్ధిగానే ఉంటామండి, మమ్మల్ని కసరుకోకండి మేము మీ శిష్యులమేగా అంటూ గురువు గారి వద్దనే ఉండిపోసాగారు.
****