నేటి ధర్మం
రచన:: బండి చందు
అలనాడు నాలుగు పాదాలపై నడిచిందట
నేడు నిలువ నీడలేక నిలబడలేక
ఆఖరి అనాథలా మిగిలిపోయింది
పుట్టుకతోనే అనూరుడిల ఆగిపోయింది
సాక్ష్యాలు చూపినా సాంప్రదాయాలు
సంక్రమించిన సరికావేవి సాటిరాని గతానికి
దశావతారాలు దర్శించినా దాగక
దాగుడుమూతలాయెను నేటి జగానికి
కన్నతల్లుల కడుపులను కాల్చిన కొరివిది
కన్నెల కన్నీటి బిందువుల కడలిది
కవుల కావ్యాలు కాలరాసిన నేలిది
తుర్కలు దోచిన మత్తగజపు కళేభరమిది
ఎత్తుకు పై ఎత్తుల చదరంగపు క్రీడిది
రాజులేలిన రణతంత్రపు భూమిది
భారతం కాదిది ధర్మరాజుపై భారం వేయడానికి
కురుక్షేత్రం కాదిది గోపాలుడు గీత వల్లించడానికి
ఏ న్యాయదేవత నరమేధానికి పూనుకోవాలో
ఏ నాల్గవ సింహం నడిరోడ్డుపై గర్జించాలో
మరల మరలిరాని ధర్మాన్ని ఇలపై నిలపడానికి…
***