ఆది గురువు
రచన:: జె వి కుమార్ చేపూరి
ఆది శంకరులు భారతాన
ఉదయించె కాలడి లోన
బౌద్ధమతం ఉచ్చ స్థితిలోన
వెలుగుతున్న తరుణాన
హిందూమత పునరుద్ధరణ
ఆవశ్యమైన సమయాన
ఆ ఆదిదేవుని అంశాన
శంకరులవతరించే భువిన
పూవు పుట్టగనే పరిమళం
అబ్బెను ఏకసంథాగ్రాహం
పేద బిక్ష తెచ్చిన సంతోషం
పసిడి తెచ్చె కనకధారాస్తోత్రం
తల్లి నీటి ఇక్కట్లు తొలగింప
పూర్ణా నదినింటికి రప్పించె
తల్లి ఆర్యమాంబ నొప్పించి
నర్మదా నది ఒడ్డునకు చేరె
దొరికెను గురుల దీవెన
దేవదేవుని ఆశీర్వచన
పెరిగిన తన జీవితకాలం
దేశాటనకిచ్చె అవకాశం
నలు దిక్కుల మఠాల స్థాపించి
అద్వైతాన్ని విరచించి, అందరినొప్పించి
హిందూ మతాన్ని పునరుద్ధరించిన
శంకరాచార్యులు ఆది గురువే ఇలన
***