అంశం: స్వేచ్చా స్వాతంత్ర్యం ఎక్కడ!?
నిజమైన స్వాతంత్ర్యం రావాలి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: రమేష్ గుజ్జేటి
ఎందరో వీరుల త్యాగఫలితం
తెల్లదొరల పాలన భారతాన్ని
విడిచిన వైనం.
మువ్వన్నెల జెండా ఎర్రకోటపై
ఎగురుతున్న వేళ ప్రతి భారతీయుడి మధి పులకించిన వేళ ఇది!
బానిస బతుకులు వద్దు
శ్రమ దోపిడి వద్దు అంటూ
అందరూ సమానగుంటంని
అందరూ సంతసించిన వేళ,
మాటల్లోనే ఉంది సమానత్వం
చేతల్లో లేదు అచేతనమే !
73 ఏళ్ల గణతంత్రం ఈ దినం
తినడానికి తిండి లేక వుండ
గూడు లేక, పుట్పాత్ లే
నిలయాలుగా వుంటూ
ఇంకా ఆకలితో అలమటించే
అన్నార్తుల ఆవేదన! ఇది అగేదెన్నడో!
మానవత్వపు విలువలు
తరిగిన ఈ రోజుల్లో
మల్లెల మనసులా వికసించే దేపుడో!
అందరం త్లలి భారతి పిల్లలం
మనలో అక్షర జ్ఞానం లేకనే
బ్రతుకులల్లో చీకటి,
మనలో జ్ఞాన జ్యోతులను
వెలు గిద్దాం, స్వేచ్చా స్వాతంత్య్రం అందరికీ
అందేలా చూద్దాం,
సువిశాల భారతం మనది
విశ్వ గురువు భారతమని
ఎలుగెత్తి చాటుదాం!
అప్పుడే స్వేచ్చా స్వాతంత్ర్యం
ప్రతి మదిని తాకుతుంది
పచ్చని పైరులా జెండా
రెప రెప లాడుతుంది
ఆ సేతు హిమాచలం
సంబుర పడుతుంది!