పోస్ట్ కార్డ్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: మద్ధిలి కేశవరావు
“నాను ఎనాగ సెప్తున్నానో..అనాగే రాయి.. ఒక్క అచ్చరం ముక్క కూడా తేడా నేకూడదు.. ఇన్నావా..?! ” అంటూ బొంబాయిలో వున్న కొడుకు దగ్గరకు ఉత్తరం రాసేందుకు తల్లి సావిత్రమ్మ పక్కింటి పెద్దమనిషి కి చెబుతోంది.” ” కొడకా కమలేశా.. ఈ దీపాలామాసికి ఊరు వత్తానని పక్కూరు పరుశురాముడుతో కబురు పంపినావు. ఇయ్యాలికి అయిదు దినాలైపోతుంది. కానరావు. దేసమెల్లి ఏడాది గడిసి పోయింది. ఇంతవరకు నయాపైసా ఇంటికి పంపనేదు. మీ అయ్య వూరు సందులో నిన్న జడిసిపోయినాడు. ఊస్టంతో దుప్పటి కప్పుకొని ఇంటి మూల తొంగోయున్నాడ మా ఇద్దరికీ నీమీనే బెంగ, వచ్చే పెద్ద పండక్కి ఎనాగైనా లగ్గం తీసేయాలి అని మీ మేనమామ ఒకటే కంగారు. నువ్వొత్తే గానీ ఏ మాట సెప్పనేకపోతున్నాను. కొడకా, కార్తీకమాసం మంచిదని, లగ్గమ్ తేసెయ్యమని మనూరు పూజారి నిన్న సెప్పినాడు. మర్సిపోకు..ఈ వుత్తరం అందగానే ఊరికి బయల్దేరిపో, కొడకా మర్శిపోకు. మీ అయ్యకు తగ్గిపోతాదిలే. రెండు నాటుసారా బెస్తాలు తాగితే సరిపోద్ది. నువ్వు మాత్రం ఈ పోస్టు కార్డు అందగానే వచ్చెయ్యలా, వుంటా బిడ్డా..!”
“అయ్యా..అద్రసూ నీకు తెల్సుకదా.. కొడిక్కి పెళ్లి సేసేయాలి..అదే నా బాద.. ఉంతాను బాబూ ” అంటూ ఉత్తరం తీసుకొని సావిత్రమ్మ పోస్టాఫీసు వైపు అడుగులు వేసింది.