ప్రకృతి విచ్చిన్నం
రచన: సావిత్రి తోట “జాహ్నవి”
గూడు చెదిరే
గుండె బెదిరే
రక్షించవలసిన దేవుడే
రక్షణకై వేచి చూచే.
నింగి నేల ఏకమయ్యే
వాగు వంక పోంగిపోరలే
పండిన పంట నేలరాలే.
ప్రజా జీవనమే తలకిందులయ్యే.
ఒక తూరి ఏడారి బతుకయ్యే
ఒక తూరి తుఫాన్లు ముంచిపోయే
కానరాని మానవత్వానికి బలై
కానలేమో తరలిపోయే.
ఇదంతా మానవ తప్పిదమే కానీ…
మరొకటి కాదని హెచ్చరించే ప్రకృతి.