సంకల్పం

(అంశం: చందమామ కథలు)

సంకల్పం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు

     ఒకవూరిలో గణేష్ గోపి గోవింద్ ముగ్గురు స్నేహితులు. వారు అనాధులు.రోడ్లు మీద కాగితాలు చెత్త ఏరకొని ఎలాగో కాలం గడిపేస్తున్నారు.అయితే ముగ్గురు దేశ ముదుర్లు.ఆరోజుకు ఏదో పొట్ట గడిపించేసుకొని ఏ బ్రిడ్జి ప్రక్కనో ఏ రైల్వే బస్ స్టేషన్లలో పడుకుంటారు.

         ఎప్పుడు వీళ్ళను గమనించిన ఒక పేద జంట.నిత్యం కష్ట పడే జంట పిల్లలు కూడా లేని జంట వాళ్లకోసం మాట్లాడుకుని ఎలాగైనా వారిని ఒక మార్గం లో పెడదామని నిశ్చయించ్చుకున్నారు. ఒకరోజు ఆ ముగ్గుర్ని పిలిచి మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటే వారి వివరాలు వాళ్ళకే తెలీదట. ఒకరు చెత్తకుండీలో ఇంకొకరు మురికి కాలువలో ఇంకొకరు మురికి కాల్వలో దొరికితే అనాధాశ్రమంలో పెంచు కున్నారని అక్కడ బాధలు భరించ లేక తప్పించుకు వచ్చేసారని తెలుసుకున్నారు.వారి కథలు విని దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. మీరు చదువుకుంటే బాగుంటుంది కదా. ఎందుకు ఈ చెత్తపనులు అని మందలించారు
మాకు చదువుకోవాలని ఉంది.కానీ మాకు తిండి ఎవరు పెడతారు.చదువు ఎవరు చదివిస్తారు అని భాద పడ్డారు.దానికి దంపతులు మాకు పిల్లలు లేరు.మేము కష్టపడుతున్నాం.మిమ్మల్ని మేము చదివిస్తాం అని చెప్పారు. ముగ్గురు ఓకే చెప్పారు.ఆరోజు నుండి ముగ్గురిని ఆ పేద దంపతులు కన్న బిడ్డల్లా పెంచి చదివించారు.వాళ్ళు కూడా వాళ్ళను సొంత తల్లిదండ్రులు గా భావించారు.ఒకరు లాయర్ ఒకరు టీచర్ ఒకరు పోలీస్ ఆఫీసర్ అయ్యారు. సమాజమంటే ఒకరికి ఒకరు అని తలచి వాళ్ళు కూడా వీళ్ళ లాంటి వాళ్లకోసం అనాధ ఆశ్రమం ఏర్పాటు చేసి సమాజానికి మేలుకొలిపారు. వృద్ధ దంపతులు ఫలితం దక్కిందని ఆనందించారు.
సకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!