తెలుగు వెలుగు సురవరం!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఎం.వి.చంద్రశేఖరరావు
తెలుగు వెలుగు, మన సురవరం ప్రతాపరెడ్డి!ఉర్దూభాష ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు,
గోల్కొండ పత్రికను ప్రారంభించి, తెలుగులో భావస్వేఛ్ఛతో, నిజాము పాలనను, వ్యతిరేకించిన
సురవరం ప్రతాపరెడ్డిగారు తెలుగుభాషా వరం!
తెలంగాణలో కవులు, లేరన్న వాదనను తోసిపుచ్చి,గోల్కొండ కవులసంచికలో,
మూడువందల యాభై నాలుగుమంది కవులతో , తెలుగు భాషా ప్రాభవాన్నిచాటిన మహనీయుడు,
సురవరం! తెలుగువాళ్ళ కట్టు, బొట్టు,
వ్యవహారశైలితో ఆంధ్రులసాంఘిచరిత్రను తెనిగించి, సాహిత్య అకాడమీ అవార్డును పొంది,
నేటి యువతరానికి శిక్షణపాఠముగా,ఙ్ఞానం
పంచుతున్న, తెలుగు భాషా వీరుడు, సురవరం!
పత్రికా సంపాదకుడుగా, రాజకీయ దురంధరుడిగా,
తెలుగు వాడి, వేడి, సాహిత్య ప్రతాపాన్ని
చూపించిన సురవరం, మనందరి వరం!