వీడ్కోలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కార్తీక్ నేతి
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం..
అంటు మొదలుపెట్టారు అమృత సాహిత్యాన్ని ,
అక్షరాలను పేర్చి , పదాలను కూర్చి ,
ఇంత పరుగు ఎందుకొరకు ప్రశినిస్తూ?
భగవద్గీత, మహాభారత సారాన్ని
విన సొంపుగా పాటలుగా మలిచి అందరు వినేల చేసారు
గుండెల్లో గొప్ప స్థానాన్ని ఏర్పరుచుకున్నారు
ఏనాడు పేరును ఆశించి రాయలేదని చెప్పిన సందర్బలెన్నో
మనిషికి మనిషికి మద్య ఉండాల్సింది “Some బాషణలు కాదంటూ”
సంబాషణలు అవసరమంటు మాటల ద్వారా ప్రేరేపించారు
నిద్రాణమై ఉన్న మనిషిని తట్టి లేపెందుకు,
సాహిత్య సేద్యం చేసి కాగితంపై పండించారు వేల గీతాలను ,
ఆఖరి మణిమాణిక్యాన్ని సిరివెన్నెల అంటూ రచించి
చివరి సంతకం చేసి కళా ప్రవాహాన్ని ఆపేసి
దివి నుండి గగనానికి చేరిన మీ దేహానికి కన్నీటి
సంద్రంతో తెలుపుతున్నాము అంతిమ వీడ్కోలు
కాలం అంతమయ్యే వరకు , కలం ఉన్నంత వరకు ప్రమిద
రూపంలో వెలుగుతూనే ఉంటారు మా మనసుల్లో.