విత్తనాలు ప్రశ్నిస్తున్నాయి (కవితా సమీక్ష)
సమీక్ష: అనిశెట్టి సతీష్ కుమార్
కవితా శీర్షిక: విత్తనాలు ప్రశ్నిస్తున్నాయి
రచన: భైతి దుర్గయ్య
భైతి దుర్గయ్య గారు రాసిన ఈ కవితలో ఒక విత్తనానికి ప్రాణం ఉంటే అది తన మనోగతంలో దాచుకున్న ప్రశ్నలు ఎన్నిరకలుగా వేస్తుందో చక్కగా వివరించారు. నేడు జరుగుతున్న కల్తీ విత్తనాల వ్యాపారం వల్ల విత్తనం తన జీవితాన్ని మొలకెత్తకుండానే ఎలా కోల్పోతుందో అలాగే నేటి సమాజంలో ఉన్న విషం నిండిన మనుషుల్లా తన చుట్టూ వున్న కలుపు మొక్కల గురించి తనను తాను కాపాడుకోడానికి పడే కష్టాన్ని, మన జీవితంలో వచ్చే కష్టనష్టాలలాగా విత్తుకు శత్రువైన కరువు కాటకాల గురించి పడిన భయాన్ని వివరిస్తూ, ఇంత కష్టపడి ఎదిగినా చివరకు మద్దతు ధర లేక రైతుకు మిగిలేది కన్నీరే అనే నగ్న సత్యాన్ని తెలియజేసింది ఈ విత్తనాలు ప్రశ్నిస్తున్నాయి అనే కవిత ద్వారా బాగా తెలియజేసారు భైతి దుర్గయ్య గారు. మంచి కవిత రాసిన భైతి దుర్గయ్య సార్ గారికి ధన్యవాదాలు.