మానవుడా ఆలోచించరా?
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఆనంగి సతీష్
మానవత్వం మంట కలిసిన వేళ
మానవుడు విర్రవీగుతున్న వేళ
ఏమని చెప్పను! ఎన్నని చెప్పను!
స్వార్థంతో నిండిన మనసుతో
కల్మషంతో కూడిన ప్రేమతో
పగ ప్రతీకారాలే ధ్యేయంగా చేసుకుని
మనిషి రూపంలో ఉన్న మృగంలా ప్రవర్తిస్తూ సాటి మనిషికి కూడా సాయం చేయలేనంత ధనాన్ని కూడాగట్టుకుని చివరకు తాను ఏమీ తీసుకెళ్లలేడు అని తెలిసినా
జ్ఞానం సంపాదించిన అజ్ఞానిగా మారి ఆధునికతతో నిర్మించుకున్న ప్రయోగశాలలో ఆవిరవుతున్న మానవత్వపు విలువలతో నాగరికత పేరుతో నిర్మించుకున్న ధన రాసులతో
నాగలి దున్నిన భూమిలో అణుమంటలతో
గగనతల పరిశోధనకై స్వార్ధపు లక్ష్యాలతో
రివ్వున ఎగిరే చిలుక వంటి పలుకులతో
రివ్వున ఎగిరేసుకుపోయే డేగ వంటి మనసుతో
గత కాలపు మితిమీరిన కక్షలతో
కంటతడి పెట్టించే ఆకలి చావులతో
కంటతడి తుడిచే తోడుకై ఎదురు చూపులతో..
చివరకు అశాంతిని ఆక్రోశాన్ని అనుమానాలను పెంచుకుని తన ఉనికిని ఆగమ్యగోచరంగా మార్చుకుని మానవత్వాన్ని ,మనస్సుని, మనిషిని కూడా మంట కలుపుతున్నాడు
ఇది నీకు తగునా మానవుడా!