(అంశం: “ఏడ తానున్నాడో”)
అవతరించు అపరదుర్గవై
రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
నేటి సమాజంలో పదినెలల పాలుగారే పసిడి బుగ్గల చిన్నారి నుంచి పాండుటాకులాంటి ముదుసలి పై జరిగే అత్యాచారాలను చూస్తుంటే మానవ సమాజంలో ఉన్నామా మృగాల నడుమ ఉన్నామా అని సందేహం కలుగక మానదు .
స్తీలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కలిగి రోదసిలోకి వెళ్ళినా,
దేశభద్రతలోను పురుషునితో సమానంగా పనిచేస్తున్నా, చట్టాలెన్ని రూపుదిద్దుకున్నా, అవసరమైనపుడు ఎవరోవస్తారని చూడక
అపర దుర్గగా మారి మహిషాసురులను సంహరించినపుడే
గాంధీ కలలు కన్న సురాజ్యం ఏర్పడుతుందని తెలుసుకో మహిళా…..!!