(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)
చీకటి రాత్రి
రచయిత :: దోసపాటి వెంకట రామచంద్రరావు
ఎప్పటిలా ఆరోజు కూడా అర్ధరాత్రి దాటిపొయింది రాజారావు ఇంటికి వెళ్ళెటప్పటికి.అతను భయంభయంగానే బయలుదేరుతాడు.ఎందుకంటే
అతను ఇంటికి వెళ్ళదారిలో శ్మశానం ఉంటుంది.
ఎదో ఒక శవం కాలుతూనే వుంటుంది.ఆంజనేయ దండం చదువుకొని వెళ్ళడం అలవాటయింది.
ఆ రోజు కూడా అలాగే ఆంజనేయదండం చదువుకొంటూ వెళ్తున్నాడు.
“ఓరేయ్ రాజా !ఆగురా !నేనుకూడా వస్తున్నా.”అని
ఎవరో పిలుస్తున్నట్టయ్యింది.వెనకకి చూడాలంటే భయం.వెనకకు చూడకుండా వేగంగా అడుగులు వేయసాగాడు.
ఇంకా రాజా ఆగు ఆగు వస్తున్నా నేను రఘు నీ.నీ స్నహితుడినిరా అని మాటలు వినపడుతున్నాయి.అదేమి పట్టించుకోకుడా రాజారావు పరుగెడుతున్నట్టు వెళ్ళిపోతున్నాడు.
కొంతసేపటి ఎలాంటి పిలుపులుగాని అడుగుల చప్పుడు గాని వినపడలేదు. ధౌర్యంగా వెనకకు తిరిగి చూశాడు. నిజమే ఎవరూ లేరు. వడివడిగా నడుచుకుంటూ రాజారావు వెళ్ళసాగడు. అయినా ఈ రఘుగాడు ఇంతరాత్రివరకు ఎందుకు ఇక్కడ వుంటాడు.ఇదంతా ని బ్రమ కాకపోతే.ఇల్లు చేరాడు రాజారావు.
ఇంట్లో వాళ్ళకి అలవాటే గనుక ఎవరూ ఎందుకు ఆలస్యమైందని ఆడగలేదు.
చాలా సేపటి వరకు రఘు గురించే ఆలోచిస్తూ ఎప్పడు నిద్రలోకి జారుకున్నాడో తెలియదు. మర్నాడు మళ్ళీ అదే తంతూ.
ఇలా ఒక వారం రొజులు గడిచిపోయాయి. మర్నాడు రఘుని మరో స్నేహితుడు రవి ని కలిసి ఈ విషయం చెప్పబోతే ససేమిరా కాదన్నారు.
శ్మశానం దాటి వస్తున్నందువలన ఏ గాలి సొకింటుందని కొట్టిపారేశారు.మనం స్నేహితులంకదా
అలా ఎలా చేస్తామని నమ్మించారు.
రాజారావు కి శంక తీరటంలేదు .ఆలోచించి ఆలోచించి జ్వరం తెచ్చుకొని మంచం పట్టాడు.కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది.
ఇంతకి కొసమెరుపు ఏమిటంటే.రఘు రవి పందెం వేసుకున్నారు.రాజారావుని భయపెడితే చాలని. దానికి రఘు సరేనన్నాడు.వాళ్ళు ముగ్గరు స్నేహితులే.
ముగ్గురిలో రాజారావు చాలా పిరికివాడు.అదీ సంగతి.పందెంలో రఘు గెలిచాడు.