చివరకు మిగిలేది..!? (కవితా సమీక్ష)

చివరకు మిగిలేది..!? (కవితా సమీక్ష)

సమీక్ష: బాలపద్మం (వి వి పద్మనాభరావు)

పద్మావతి గారు చాలా బాగా వ్రాసారు. మీ భావానికి తగ్గట్టు గా పదాలను కూర్చారు. బాగుంది మీ కవిత. నిజ జీవితం లో మనిషి పడే తాపత్రయ చర్యలని కాటి కాపరి దిన చర్యకు అన్వయిస్తూ బాగా చెప్పారు.
నిజమే,.. తిరిగిరాని దేహం కోసం తపన,
నిజాయితీకి కాపు కాస్తూ బ్రతకడం,
నీతి నియమాలను కనిపెడుతూ నడవడం,
కడ వరకూ ఉండే బంధాలను చివరకు వదిలి పోవాలని
బాగా వివరించారు. అను నిత్యం పోరాటమే గా మనిషి మనుగడ. చక్కని విశ్లేషణ, అభినందనలు సోదరీ.

********************

కవిత: చివరకు మిగిలేది..!?
రచన: శ్రీమతి విస్సాప్రగడ పద్మావతి

మట్టిలో ,అగ్నిలో,నీటిలో
కలిసిన దేహం తిరిగిరానట్టు
గతించిన కాలమును
ఎప్పటికీ స్పృశించలేము..

కాలంతో కలిసిపోయి
యంత్రంలా పనిచేయడం
కాదుగా కాటికాపరి
నిజజీవితంలో నిజాయితీగా
బతికే ప్రతిఒక్కరి జీవితం
ఒక కాటికాపరే

మిథ్యా చట్రాల్లో ఊగిసలాడకుండా
నీతి నియమాల విజృంభణకు
సిద్ధమయ్యే ప్రతీ ఒక్కరూ
కాటికాపరులే

దేహంతో బంధీ ఐయిన బంధాలెన్నో
కడవరకూ తోడుండే బంధం నొదలి పయనించే వాడు కాటికాపరే గదా
కాటిలో ఎన్నో కర్మలు చేసేవాడు కాపరి అయితే చివరకు మిగిలేది ఏంటి??

బతుకు బాటలో వణుకు
బెణుకు లేక నిజాయితీగా
పనిచేసే ప్రతీ ఒక్కరికీ
క్రూర కౌగిళ్ల వికృత చేష్టలు
అనుక్షణం వెంటాడుతూనే ఉంటాయి

అనునిత్యం వాటితో పోరాడుతూ
తమ కర్తవ్యాలకు తలవంచే ప్రతి ఒక్కరూ కాటికాపరులే..

********************

You May Also Like

4 thoughts on “చివరకు మిగిలేది..!? (కవితా సమీక్ష)

  1. చిక్కని కవితకు
    చక్కని సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!