కోడలి వంట

అంశం: హాస్య కవిత

కోడలి వంట
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శంకర్ చంద్రమౌళి

కల్యాణం కమనీయం అంటూ భాజా భజంత్రీలు మోగేను.
మనసు ఆనందాల హరివిల్లై నారీ శిరోమణి అత్తింట కాలు మోపేను.
అత్తింటి వారి ఆదరణ, ప్రోత్సాహం తనకు అందిన వరాలని మురిసేను ఆ మగువ.
కొత్తకోడలి చేతి పాయసం కాదా మన ఇంటి ఆచారం అని ఆనతి నిచ్చెను అత్తగారు.
వంట అంటే ఇష్టమైనా ఏ నాడూ పుట్టింటి వంటింట కాలిడలేని ఆ శిరోమణికి కాదా అది మహదానందం.
తత్ క్షణమే చేసెను పాకశాలలో రంగ ప్రవేశం. పాయసాన్ని చేసాననుకొని చేసెను కొత్త ప్రయోగం.
పాలకోవా ఏమో యని బహు ప్రీతి నొందిరి బంధు జనం.
మధ్యాహ్న కాల భోజనానికి కూడా సకలం సిద్ధమన్న కొత్త కోడలిని చూసి ముచ్చట పడెను అత్తింటి బంధు జనం.
వడ్డించు సమయాన పదార్థాల పేర్లు అడిగిన పెద్దాయనతో
“పుల్లగా చింత పండు పప్పు, కారంగా పండు మిర్చి కూర,
కమ్మగా ఆవకాయ సాంబార్ అని చెప్పిన శిరోమణి సమాధానానికి అతిథుల ఆకలి హుష్ కాకీ ఆయేనే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!