(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)
మనస్సాక్షి సమాధానం
రచన: విజయ మలవతు
పుడమిన చిగురించిన రోజైనా
నిశీధి అంచున నిలచిన రోజైనా
మరణం చివరి అంచున ఉన్న నాడైనా
అంతరంగం సంధించే ఎన్నెన్ని ప్రశ్నల కైనా
మనస్సాక్షి చెప్పే నిజాలే ముఖ్యమైనవిగా…
అంతరంగం పదే పదే అడిగే ప్రశ్నలకు
ఏనాడు దొరుకునో సమాధానాలు తెలియక
అంతులేని సమస్యలతో
నిన్ను ఊరుకోబెట్టలేక
జీవితమంతా నీ ముందు పరిచే ధైర్యం తెచ్చుకొని
మనసుకు సర్ది చెప్పి మరి
మనస్సాక్షిని స్వచ్ఛమైన మదితో
పరుస్తున్నా నీ ముందే
సత్య శోధనలో మేటి
మనసాక్షి తప్ప వేరేది లేదుగా
అంతరంగం ముందు
పరదాలే ఉండవుగా..
అంతరంగాన్ని మోసం చేసే మనసు
మనషి జగాన ఆనందంగా ఉండునా…!
—————————————
బాగా చెప్పారండీ.. మనస్సాక్షిని మోసం చేసి ఉండగలం కానీ ఆనందంగా బ్రతకలేము కదా…👌👌👏👏