మనిషి బ్రతుకులో చిచ్చు పెట్టిన కరొనా
రచయిత:శివ
నవ భారతం మనది ..
భరతుడు పాలించిన దేశం మనది… కానీ
ఎట్టునుండో వచ్చిందో….
ఎనలేని కష్టాలు తెచ్చింది…
మనిషి బ్రతుకులో బుష్ మంటు చివరికి మనిషిని బూడిద చేస్తుంది…..
చిరునవ్వులతో ఉన్న మనల్ని చిత్తి లో కాల్చేస్తుంది ….
ప్రేమ గా మన వెంట వుండే వారిని మనకు తోడుగా వుండే వారిని
అందారాన్ని లోకాలకు పంపిస్తుంది ఈ మహమ్మారి …
ఇటు ,అటు, అంటూ పరుగులు తీస్తూ నవ భారతాన్ని
స్మశాన వాటిక మార్చాలి అనుకుంటుంది ఈ మహమ్మారి కరొనా..
అందుకే మిత్రమా..
చూస్తూ వుండకు మిత్రమా వీలు అయ్యేంతవరకు పోరాడుతూ
మన దేశ పౌరులను కాపాడుతూ అందరికి దూరం పాటిస్తూ
మనసుతో నీ మంచితనాన్ని శాసిస్తు
నలుగురికి సహాయం చేస్తూ మన దేశాన్ని ..
మన భూమిన్ని.. మనము కాపాడుకుందాం ..
***