అంశం: మనస్సాక్షి
నీ మనసే నీ దర్పణం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : ఎస్. ఎల్. రాజేష్
అభివృద్ధి పథాన పరుగులు తీస్తూ
నా పయనం ఆరోహణం అని భ్రమ పడుతున్న
ఓ మనిషి.. ఒక్కసారి ఆగి చూడు
నీ అంతరాత్మను అడిగి చూడు
నీకు జీవితమిచ్చిన అమ్మానాన్నలకు
నీవు ప్రేమనిస్తున్నావా..
నీ జీవన మార్గానికి బాటలు వేసిన గురువులకు
గౌరవం చూపుతున్నావా
నీకు పోషణ ఇస్తున్న ఉద్యోగంలో
సంతృప్తిగా ఉన్నావా
నీ పట్ల నమ్మకంతో ఉన్న ప్రజలకు
నిజమైన నాయకుడిగా తోడు ఉన్నావా
ఎన్నికల్లో గెలిచి ఇచ్చిన హామీలు
నెరవేరుస్తున్నావా
స్వలాభం కోసం కాకుండా నీ వ్యాపారాన్ని
వినియోగారులకు అందిస్తున్నావా
నిన్ను నమ్మి వచ్చిన భార్య మీద
మమకారం ఎంత ఉందో..
నువ్వు కన్న పిల్లల పట్ల
బాధ్యత నిర్వహణ ఎలా ఉందో..
డబ్బు తీసుకుని వేసిన ఓటు
నీ భావి తరాల పై ఎలా పడుతుందో
నీ వల్ల సమాజానికి, దేశానికి
ఎంత మేలు జరుగుతుందో..
నీ మనస్సాక్షిని అడిగి చూడు నేస్తం
అద్దమై నిన్ను ఆవిష్కరిస్తుంది
నిన్ను మానవీయ మనిషిగా తీర్చి దిద్దుతుంది.