(అంశం:” ప్రమాదం”)
ఓ మనిషీ మేలుకో..
రచన::చింతా రాంబాబు
ప్రకృతి అందించే
గాలి ని కలుషితం చేస్తున్నావు
మితిమీరిన రక్షణ లేని పరిశ్రమలు స్థాపించి…
పట్టణీకరణ పేరుతో వనాలను
అంతం చేస్తున్నావు
నిలబడే నీడ లేకుండా…
ప్లాస్టిక్ వ్యర్ధాలతో జలాలను
కలుషితం చేస్తున్నావు
గొంతు తడిపే గుక్కెడు మంచినీరు లేకుండా..
ఓ మనిషీ తెలుసుకో…
ఇప్పటికైనా మేలుకో..
ప్రమాదం అని తెలిసినా..
లెక్కచేయని నీ అజ్ఞానం
అవుతుంది నీ జీవితానికి శాపం
పచ్చని మొక్కను పెంచుదాం
పర్యావరణాన్ని రక్షించుకుందాం
ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుందాం
భావి తరాలకు మంచి మార్గం చూపుదాం.
***