పించిన్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారుమంచి వాణి ప్రభాకరి
సూర్యోదయంతో పాటే రాజయ్య పొలానికి వెడతాడు. అక్కడ పాలు పితికి డిపో వారికి పట్టుకెళ్ళి పోస్తాడు. నెలకి ఐదువేలు జీతము ఇస్తారు. “అన్ని అధిక ధర వస్తువులు. దానితో కుటుంబం గడవదు”. కానీ జీవించడం తప్పదు
పించిన్ ఆఫీస్ కి వెళ్లి ఎలా అడగాలో తెలియదు, ఎవరిని అడిగినా చెప్పరు. కొడుకును చదివించాడు.
వాడు బి.ఏ చదువు కోని పట్నంలో ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఏమి అడిగిన సెలవు లేదు అంటాడు.
వెంకయ్యకి ఇల్లు ఉన్నది అయిన పెన్షన్ వస్తోంది. నాకు అవసరమే అనుకున్నాడు వెళ్లి వెంకయ్యను ఎలా పెట్టుకోవాలి అని అడిగాడు. మనకు సచివాలయం ఉంది కదా! “మన వలంటిర్ని అడిగితే పెట్టీ పెడుతుంది”. అలాగే అని రాజయ్య వెళ్లి అడిగాడు. వివరాలు పుచ్చుకుని పించన్ కి పర్మిషన్ ఇచ్చారు. వచ్చే పించన్ తో వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది. మనిషి జీవిత నాటకంలో ఏది కూడా తప్పవు నానాటి బ్రతుకు నాటకములో ” శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలో చెప్పిన జీవిత సత్యం అందరికీ వర్తిస్తుంది.” “మనిషికి మంచి హితులు స్నేహితులు బంధువులు ఒక ధైర్యము ఒక భరోసా మాట సహాయం ఎంతో గొప్పది”.