(అంశం:”ప్రేమ ఎంత మధురం”)
సరిలేరు ప్రేమకి
రచన:కవిత దాస్యం
కిరీటి గీత ప్రేమికులు. వారి ప్రేమ అమరం అజరామరం. చదువుకునే రోజుల నుంచి ప్రేమించుకుంటూ ఎవరు చూసినా వీరి ప్రేమ కుళ్ళు కునేలా ఉండేది. రాను రాను ఎవరి కళ్ళ దిష్టి పడిందో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళు వస్తుండగా, యాక్సిడెంట్ అయి గీతకి కళ్ళు పోతాయి. విధి వైపరీత్యం కాటు వేసిన ఏమాత్రం చెలించని కిరీటి ఎవరు చెప్పినా వినకుండా, తన ప్రేమ ఎంత మధురమైనదో తెలియపరుస్తూ, ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. విధి వంచిoచిన తరగని వారి ప్రేమ దాంపత్య బంధాన్ని మరింత ధృఢ పరిచింది. ఒకరికొకరు అన్నట్టుగా కాకుండా, ఇద్దరు ఒకరై జీవించడం మొదలెట్టారు. గీతకి కళ్ళు పోయాక కిరీటి ప్రేమ ఆకాశమే హద్దుగా, అవధులు లేని ప్రేమను చూపిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తన ప్రేమ మాధుర్యం అంతా పంచాడు.
భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం తో వారి జీవితం షష్టిపూర్తి దశకు చేరుకుంటుంది. వారి కానుకగా ఇద్దరు పిల్లలు. గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేస్తారు పిల్లలు. పార్టీ ముగిశాక భార్య భర్తతో నేను డ్రైవ్ చేస్తాను, మీరు రూట్ చెప్పండి అంటుంది. అలాగే వారు తమ ఇంటికి చేరుకుంటారు. భార్యకు ఇంటికి వెళ్లే రూట్ చెప్పడానికి కారణం తనకి కళ్ళు కనిపించవు అలాంటి స్థితిలో కూడా భార్యపై నమ్మకం, ప్రేమతో కార్ ఇస్తాడు. భర్త పై నమ్మకంతో తను డ్రైవ్ చేస్తుంది. లైవ్ సాఫీగా కొనసాగాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ ఎంతో అవసరం. ప్రేమ అనేది ఉంటే అన్నీ అడ్డంకుల్ని తొలగిస్తుంది!
నీతి :జీవితంలో ముందుకు సాగాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ తప్పని సరి.