స్నేహగీతం
రచన: విస్సాప్రగడ పద్మావతి
అవి కాలేజీకి వెళ్లే రోజులు. ప్రత్యూష , నరేంద్ర మంచి మిత్రులు. ఒకే ఊరి వాళ్లు కూడా. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. బిఎస్సి రెండో సంవత్సరాన్ని పూర్తిచేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. డిగ్రీ తర్వాత ఏం చేయాలి అని నిర్దిష్ట ప్రణాళికలు వేసుకుని ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టారు. పరీక్షలు ఆసన్నమాయే తరుణంలో ఫేర్వెల్ పార్టీల సందడి మొదలైంది. అంత వరకు ఒకే ప్రాణంగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు ఒక్కసారిగా విడిపోవడాన్ని భరించలేకపోయారు. నేస్తమా ఎన్నాళ్ళకో మళ్ళీ మన కలయిక అంటూ స్నేహ గీతికలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నా ,ఎలా ఉన్నా తప్పకుండా అందరూ సంవత్సరానికి ఒకసారైనా కలవాలని తీర్మానించుకున్నారు. అందరూ శ్రద్ధగా చదివి డిగ్రీ పట్టా చేత పట్టి ఎవరి బాటన వాళ్ళు పయనమయ్యారు.. ప్రత్యూష, నరేంద్ర బయో కెమిస్ట్రీ పరీక్షలు వ్రాసి మంచి ర్యాంకు సాధించినా.. అనివార్య కారణాల వల్ల నరేంద్ర బిఈడి లో జాయిన్ అయ్యాడు. ప్రత్యూష కి మంచి సంబంధం కుదిరి అత్త వారి ఇంటికి వెళ్లి పోయింది. మిగతా విద్యార్థులు అందరూ కూడా టీచర్స్ గా వ్యాపారస్తులు సెటిల్ అయ్యారు. 10 సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఒకరోజు నరేంద్ర, ప్రత్యూషను కలిశాడు. 10 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఒక్కసారిగా వాళ్ళ కళ్ళలో గిళ్ళలో చిన్నప్పటి రోజులు , చెప్పుకున్న ఊసులు కదలాడి, కళ్ళు చెమర్చాయి. ఊపిరాడని అలల పోరాటం. గుండె మూలల్లో దాగిన స్నేహబంధం మాటల్లో చెప్పలేని మధుర స్మృతులు నెమరు వేసుకొంటూ స్నేహితులిద్దరూ ఎంతో ప్రేమగా ఆప్యాయత అనురాగాలతో కుశలం మాట్లాడుకుని… ఎవరి బాటలో వారు తిరిగి పయనమయ్యారు.
స్నేహం ఒక మధుర స్వప్నం నిజమైన స్నేహం పొందినవాడు అసలైన అదృష్టవంతుడు.
***
nice story