ఉందిలే మంచికాలం
రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు
రఘు ఒక ప్రైవేటు కంపెనిలో చిరుద్యోగి.అతని భార్య
రమ ఒక ప్రైవేటుస్కూల్లో టీచరు.ఇద్దరు పిల్లలు.ఇద్దరు కొడుకులే.కష్టపడి ఇద్ధరిని చదివించారు.పెద్దవాడికి మంచి ఉద్యోగమే దొరికింది.
రెండోవాడూ దూరప్రాంతాలకెళ్ళి ఉద్యోగం చేయనని
ఇంటి దగ్గరగానే ఎదో ఒక చిన్న ఉద్యోగమే చేస్తానని
భీష్మించుకొని కూర్చున్నాడు.ఇక చేసేదేంలేక రఘు రమలు సరే అనక తప్పలేదు.అదే ఉద్దేశంతో ఎలాంటి
పోటిపరీక్షలు రాయడం మానివేసాడు.ఒకటో రెండో రాసినా శ్రద్దపట్టిచదవలేదు.తమ ఊరికి దగ్ఖర్లోనే
ఒక ప్రైవేటుకాలేజీలో ఫేకల్టిగా చేరాడు.అంటే ఇప్పుడు ఇంట్లో ముగ్గురు ప్రైవేటు ఉద్యోగస్తులన్నమాట.కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడె
తగ్గుముఖం పట్టడంతో పనులలోకి వెళ్తున్నారు.
కరోనాకాలంలో జీతాలులేక నానా అవస్తలు పడ్డారు.
ముందున్న పోదుపుడబ్బులతో కాలక్షేపం చేస్తూవచ్చారు.ఇప్పుడు మళ్ళీ స్కూళ్ళు,కాలేజీలు,కంపెనీలు తెరచుకోవడంతో
ఉందిలే మంచీకాలంముందుముందునా అనె పాతపాటను గుర్తుచేసుకొని నిత్యజీవనవిధానంలోకి అడుగులు వేసారు.
***