ఇదెక్కడి న్యాయం?

ఇదెక్కడి న్యాయం?

రచన: కందర్ప మూర్తి

హైస్కూలు టీచర్ గా రిటైరైన రామారావు మాస్టారు తన

ఇద్దరు కూతుళ్లలో పెద్ద కుమార్తె రేవతిని సాఫ్పువేర్ ఇంజినీర్

ప్రకాష్ కిచ్చి అంగరంగవైభవంగా పెళ్లి జరిపించారు.

కూతురు కూడా సాఫ్టువేరు ఇంజినీరింగ్ చదివి నప్పటికీ

కట్నకానుకలు , లాంఛనాల కోసం తండ్రి నుంచి వచ్చిన

యకరం భూమి అమ్మేయవల్సి వచ్చింది. ఐనా అమ్మాయి అత్త

వారింటి నుంచి సాధింపులు తప్పలేదు.

చిన్నమ్మాయి శివాని అబ్యుదయ భావాలు కల పిల్ల .

డిగ్రీ చేసిన తర్వాత జర్నలిజం , మాస్ కమ్యూనికేషన్ డిప్లమో

పూర్తి చేసింది. సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న వివక్షల్ని

వ్యతిరేకించేది.

బాల్యం నుంచి తండ్రి తమ చదువుల కోసం ఎంత కష్ట

పడింది , సమాన విధ్యార్హతతో ఉన్నా కూడా అక్క పెళ్లి , వారు

కోరిన విధంగా జరిపినప్పటికి అత్తవారి దెప్పిపొడుపులకు

నాన్న మనసులో పడ్డ బాధ అర్థం చేసుకుంది.

చిన్నప్పటి నుంచి సమాజంలో స్త్రీల పట్ల వివక్ష ,

పురుషాధిక్యం చూసి తట్టుకునేది కాదు. ఆదినుంచి ఆడవారి

పట్ల అన్యాయాల్ని, లింగ వివక్ష గురించి పత్రికలలో అనేక

వ్యాసాలు విశ్లేషణలు రాస్తుంటుంది. పూర్వం నుంచి అన్ని

వర్గాల కుటుంబాల్లో అబ్బాయిల్ని ఒక విధంగా అమ్మాయిల్ని

మరో విధంగా పెంచుతుంటారని విమర్సలు చేస్తుంటుంది.

కొడుకులు లేకపోతే ముసలి తల్లిదండ్రులు కూతురింట్లో

ఉండకూడదు. తమకున్న సర్వస్వం అర్పించి ఆడపిల్లకు పెళ్లి

చేస్తే వారు మాత్రం రోడ్డున పడాల్సిందే.

పెళ్లి పేరుతో ఆడపిల్లల తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పి చెయ్యడమే

తప్ప అల్లారు ముద్దుగా పెంచిన తమ ఆడపిల్లను జీవితాంతం

తమ ఇంటికి కానుకగా పంపుతున్నారన్న విశ్వాసం ఉండదు.

చచ్చిన తర్వాత తల కొరివి పెట్టి పున్నామ నరకానికి

చేరుస్తాడని కొడుకుల్ని నెత్తి మీద పెట్టుకుంటారు.చిన్నప్పటి

నుంచి వారికి సకల భోగాలు సమకూరుస్తారు. ఎంతైన డబ్బు

ఖర్చు పెట్టి పట్నాలకు పంపి పెద్ద చదువులు చదివిస్తారు.

ఆస్థి పంపకాల్లో వారిదే పై చెయ్యి. వారి ప్రవర్తన ఎలాగున్నా

అడగరు.ఎన్ని దగుల్బాజీ పనులు చేసినా వెనకేసుకు వస్తారు.

కొడుకు తన్ని తగిలేసి వృద్ధాశ్రమంలో పడేసినా సమ్మతమే.

అదే అమ్మాయి ఐతే ఆడ(అత్తారింటి) పిల్లని చిన్న చూపు.

పుట్టినప్పటి నుంచి ఆంక్షలు. కట్టు బొట్టు తిండిలో కూడా

నిబంధనలే. పెద్దలు గీసిన గిరిలో పెరగాల్సిందే.

సృష్టిలో ప్రకృతి పరంగా స్త్రీలలో శారీరకంగా కొన్ని సమస్యల్ని

కల్పించాడు దేవుడు. ఆడది అంటే సహనం ఓర్పు శక్తితో

జీవితమంతా బతుకుతుంది. కుటుంబ వ్యవస్థకు చుక్కాని

లాంటిది స్త్రీ.

వివాహమైన తర్వాత కుటుంబ వ్యవస్థలో తొమ్మిది నెలలు

తన గర్భంలో వంశాంకురాన్ని రక్తమాంసాలతో పెంచి

భూమ్మీదకు తీసుకు వస్తుంది. రాత్రింపవళ్లు కంటికి రెప్పలా

కాపాడుతుంది.

పురుషుడు తన శరీర సుఖాన్ని తీర్చుకుని స్త్రీలకు శరీర

భారాన్ని మిగులుస్తాడు. సృష్టిలో ఈ క్రియ అన్ని జంతు

జీవజాలానికి జరుగుతుంది. పుష్పాలు కూడా పరపరాగ

సంపర్కం ద్వారా తమ సంతతిని విస్తరించుకుంటాయి.

కొన్ని ప్రత్యేకంగా కొన్ని పరోక్షంగా తమ జాతుల్ని పెంచు

కుంటాయి.

ఆదిమానవుడి నుంచి నాగరిక మానవుడు సమాజంలో

జీవనానికి కొన్ని కట్టుబాట్లు ఆచారాలు నమ్మకాల ఏర్పాటు

చేసి క్రమశిక్షణ జీవన విధానం ఏర్పరిచారు.

స్ర్తీ, పురుషులకు జీవన విధానంలోఅనేక నియమ నిభందల్ని

అమలు పరిచారు. పురుషుడంటే బలవంతుడని స్త్రీ అబలలాగ

మగవారి అదుపాజ్ఞలలో ఉండాలని శాసించారు.మగవారి

చెప్పుచేతల్లో ఉండాలి. అదే శాసనం ఇప్పటికీ అమలు

జరుగుతోంది.

ఆలోచనల్లో చాణక్యుడిలాగ పడక మంచం మీద రంభలా

కష్టంలో అమ్మలా లాలించమని స్త్రీలకు జీవన సూత్రం

ఏర్పరిచారు.

మరి పురుషుడు తన శరీర సుఖమే చూసుకుంటున్నాడు.

తనకు వంశోద్థారకుడు కావాలంటాడు. పురుషుడు ఎన్ని

పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు. భర్త చనిపోయిన స్త్రీని విధవను

చేసి మూలన కూర్చో బెడుతున్నారు.

పెళ్లి అనే వేడుకతో మంగళసూత్ర మనే బంధంతో అగ్ని

సాక్షిగా ఏడడుగులు నడిపించి పెద్దల ముందు మంగళ

వాయిధ్యాలు పురోహితుడి వేద మంత్రాలతో రెండు దశాబ్దాలు

కన్నవారింట పుట్టి పెరిగిన కన్నెపిల్ల వెయ్యి స్వప్నాలతో

పురుషుడి చేతివేలు పట్టుకుని సంసారమనే జీవిత నౌకలో

అడుగిడుతుంది.

కన్నవారిని తోబుట్టువులు ఆప్తుల్ని వదిలి పరిచయం

లేని అపరిచితుల మధ్య తన తనువు మనసు సర్వస్వం

అర్పించి జీవిత చరమాంకం వరకు బ్రతుకు గడుపుతుంది
స్త్రీ.

వివాహమైన తర్వాత పురుషుడు భార్య వెంట కాపురానికి

ఆమె పుట్టింటికి వెళ్లడు. కట్న కానుకలు , లాంఛనాల పేరుతో

అమ్మాయి పుట్టింటి వారి నుంచి ఆమె జీవిత చరమాంకం

వరకు అయే ఖర్చులు లైఫ్ టేక్స్ మాదిరి వసూలు చేస్తున్నారు.

ఇవికాక మొదటి కాన్పు, రెండవ కాన్పు పుట్టింటి వారే

చేయించాలి. భారసాల , ఇలా అత్తారింటికి పంపే వరకూ

తడిసి మోపెడు ఖర్చులు అమ్మగారింటికి.

ఉదయం పక్కమీద నుంచి లేచింది మొదలు రాత్రి

పక్క మీద చేరేవరకు ఒక యంత్రంలో ఇంటి పనుల్లో

పిల్లలకు మొగుడికి అత్తమామలకు సేవలు చేసి అలిసినా

రాత్రి మంచం మీద మొగుణ్ణి సుఖ పెట్టాలి. ఇదా స్త్రీల

జీవితం? ఆమె మనిషి కాదా? ఆమె కు మనసుండదా?

కోరికలుండవా? ఈ వ్యవస్థ మారేదెప్పుడు?

ఈ పురుషాధిక్యత ప్రపంచంలో స్త్రీలు కనులు తెరిచేదెప్పుడు?

ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు శివానీ మనసులో కల్లోలం

రేపుతున్నాయి.పాత తరం మహిళలు చదువు లోకజ్ఞానం లేక కుటుంబవ్యవస్థలో సంప్రదాయం ఆచార వ్యవహారాలతో పెరిగి అత్తింట్లో వంటింటి పిల్లిలా కాలం గడిపేవారు.

పూర్వపు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో భర్త చనిపోతే భార్య కూడా భర్త శవంతో చితిమీద కూర్చొని కాలి ప్రాణత్యాగం చేసేవారట.

ఎంత నరక జీవితం? ఇదెక్కడి సతీ సహగమనం?

ఇల్లే సర్వస్వం , సంసారమే సమస్తం. రాత్రి మొగుడి శరీర

సుఖం తీర్చడం , పిల్లల్ని కని పెంచి పెద్ద చెయ్యడం ,

వార్ధక్యంలో మనుమలతో గడపడం, చివర్లో రోగాలతో పోరాటం

ఇదీ స్త్రీల జీవితం.

నేటి ఆధునిక తరంలో కూడా భర్తతో సమానంగా చదివి

ఉధ్యోగంలో సంపాదన ఉన్నా పగలంతా ఉధ్యోగ భాద్యతలు

నిర్వర్తించి ప్రయాణ బడలికతో ఇంటికి వచ్చినా వంటపనులు

పిల్లల బాగోగులు భార్యకి తప్పవు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నసించి ఏకాకి కుటుంబాల్లో మరొక మనిషి తోడుండదు. ఎన్ని కష్టాలైనా ఆడవారిని మాతృమమత కట్టి పడేస్తుంది. తన సుఖం చూసుకోదు.జీవితం కుటుంబానికే బలి చేస్తుంది.

” ఏరా , రామం! నీ చిన్న కూతురు ఇలా బరి తెగించిందేమిటి? ఏవో పిచ్చి రాతలతో ఏనాటినుంచో వస్తున్న మన సంప్రదాయాల్ని తప్పు పడుతూ పత్రికలకి రాస్తోందట ఈ పిల్ల కాకి. ఎవర్నో చూసి దాని మెడలో మూడు ముళ్లూ వేయించు.

ఒకరిద్దరు పిల్లలు పుట్టాక అదే దారి కొస్తుంది.” విధవ మేనత్త

సీతమ్మ తమ్ముడు రామారావు మీద నిప్పులు చెరిగింది.

“ఇదెక్కడి పోకడే, అందుకే ఆడపిల్లలకు ఎక్కువ చదువులు

వద్దన్నదని ” ఇరుగు పొరుగు బంధువుల ఈసడింపులు.

“ఎప్పటినుంచో వస్తున్న మన వివాహ వ్యవస్థను కించ పరచడం బాగోలేదండీ మాస్టారు “అని మాస్టారి స్నేహితుల వాక్బాణాలు.

ఎవరెలా మాట్లాడినా విమర్సించినా శివానీ తన ధోరణి

మార్చుకోవడం లేదు. ఇటువంటి ఆటుపోట్లు వస్తాయని

తెలిసే ఈ పత్రికా రంగంలో దిగాను అనుకుంటుంది మనసులో.

ముఢాచారాలు ముమ్మరంగా ఉండే అప్పటి రోజుల్లో కూడా

ఛాందసవాదుల ఒత్తిళ్లకు గురైఉంటారు సంఘ సంస్కర్తలు.

జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా నా కెందుకులే

ఈ బాధలని తన స్వార్థం చూసుకుంటే అప్పటి

స్వాతంత్రోధ్యమం ముందుకు సాగేదా ? అని తనలో తనే

ప్రశ్నించింది కుంటుంది శివానీ.

శివానీ కి మద్దతుగా అబ్యుదయ మహిళా సంఘాలు

స్త్రీ విముక్తి పోరాట సమితి సహకారం ఉంటోంది.

నువ్వు ఒంటరిదానివి కాదు , నీ వెంట మేమంతా ఉన్నాము.

ఇలాగే నీ రాతలతో మాకు ప్రోత్సాహం కల్గించమని మహిళా

సమాజ సమావేశాల్లో వెన్నుతట్టేవారు.

అప్పటి సమాజ సంస్కర్తలు గురజాడ అప్పారావు ,

కందుకూరి వీరేశం పంతులు , ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి

వారి రచనలు కన్యాశుల్కం, వరకట్నం, మాలపిల్ల ,చింతామణి

సాంఘిక దురాచారాలను ఎత్తి చూపే రచనలు సేకరించి

చదివేది. ఆధునిక సమాజంలో స్త్రీల ఉన్నతికి పాటుబడిన

సరోజినీ నాయుడు , దుర్గాబాయ్ దేశ్ ముఖ్ వంటి మహిళల

జీవిత చరిత్రలు చదివి స్ఫూర్తి తెచ్చుకుంది.

పసితనంలో బాలికల పట్ల అనాగరిక సంప్రదాయాలు,

ముక్కు పచ్చలారని పిల్లల బాల్య వివాహాలు , కొన్ని మత

సంప్రదాయాల్లో స్త్రీల అభిప్రాయం తెలుసుకోకుండా భార్యాభర్తల

విడాకులు , గ్రామీణ ప్రాంత మహిళల పట్ల అనేక మూఢ

ఆచారాలు ఇవన్నీ తలుచుకుని శివానీ మదన పడేది.

సాదరణంగా పెళ్లిళ్ల సంప్రదింపుల్లో కట్నకానుకలు లాంఛనాలు

విషయంలో మగవారి ప్రమేయముండదు కాని పెద్ద

ముత్తయిదువలు ఆడపడుచులు ఇది సంప్రదాయం అంటూ

ప్రోద్భలం చేస్తారు. అటు ఆడపిల్ల తల్లిదండ్రుల ఆర్థిక

పరిస్థితులు అర్థం చేసుకోరు. వారు కోరిన విధంగా

కట్నకానుకలు లాంఛనాలు తీర్చి వారు చెప్పిన పదార్థాలతో

విందుభోజనం విడిది ఏర్పాటు చేసి సారెతో అమ్మాయిని

అత్తారింటికి దిగబెట్టాలి.

పెద్దమ్మాయి పెళ్లి చేసిన తర్వాత తను అనుభవించిన

మానసిక వేదన తలుచుకుంటే చిన్నమ్మాయి శివానీ ఆలోచనలు

సబబే అనిపిస్తూంటుంది రామారావు మాస్టారికి. ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ కనులు తెరిచేదెప్పుడు?

ఈ మహా సంగ్రామంలో తను సమిధనై నాశనమైనా

పరవాలేదు. కొంతైనా సమాజంలో మార్పు కనబడితే చాలని

నిశ్చయించుకుంది జర్నలిస్ట్ శివానీ.

* * *

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!