వృద్ద సరళి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారుమంచి వాణి ప్రభా కరి
“సూర్యోదయం ముందే మంగమ్మకి పించేను వస్తుందని ఆశగా నిద్ర లేచింది”. ఒక ప్రక్క చలి ఎక్కువ అయిన తప్పదు. కొత్త సంవత్సరం రాత్రి ముగ్గువేసి, శుభకాంక్షలు రాసింది. వాలంటీర్ తెల్లవారగట్ల వచ్చి.. నిద్ర లేపి వెలి ముద్రలు వేయించింది. కొందరికి మాత్రం వెలిముద్ర తీసుకున్నది. మిగిలిన వాళ్ళు నిరాశగా చూస్తున్నారు. మంత్రి వచ్చి కేక్ కోసి కొందరికి పించేనూ బుక్ ఇచ్చారు. మంత్రి గారి కృపకు ఆనంద డోల్లలో ఉన్నారు. పెద్ద ఛానెల్స్ వారు వచ్చారు ఫోటోలు, వీడియోలు, ఎంతో ఆనందము క్షణంలో అందరూ వెళ్లి పోయారు. ఇంటికి వచ్చి ఆ సూపర్ వైజర్ కొందరికి మాత్రం ఇచ్చారు. మంగమ్మ కి వచ్చింది. కాని పక్కింటి పార్వతమ్మకి ఇవ్వలేదు.
కారణం ఆమె కూతురు ఇంట్లో ఉంటోంది. లక్ష్మీ కొడుకు ఉద్యోగస్తుడు అందుకు మానేశారు.
ఏ కొడుకు, కూతురు నీ ఖర్చులకు డబ్బు ఇదిగో అంటూ ఇచ్చేవారు ఉన్నారు. కాని ఈ కొడుకు అందరికీ వృద్ద జీవిత రవళిలో కొంత సొమ్ము ఇవ్వడము ఆనందదాయకంగా ఉన్నారు. కొత్త సంవత్సరం ఈ మార్పుతో ఎందరికో జీవిన రవళిలో మెరుపు మార్పు. ఎక్కడినుంచి వినిపిస్తోంది. “నా నాటి బ్రతుకు నాటకము అని.. ఏం.ఎస్ గళం నుంచి శ్రీ అన్నమయ్య, శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తన వినిపిస్తోంది.” ఇంచు మించు మూడు వేల వరకు పించేన్ రాక సమస్య వలయంలో ఆలోచనలో పడీ, పునరుద్దరణ కోసం న్యూస్ పేపర్స్ చూస్తున్నారు.