అహింస వాది
రచన :: కవిత దాస్యం
సత్యం అహింసలు గాంధీ మార్గం…
అహింస ఆయుధంగా సత్యం ధర్మం సైన్యంగా.. చెడు చూడకు, చెడు వినకు అనకు నినాదాలే స్పూర్తి దాయకం..
బానిస బతుకు లకు చరమగీతం పాడి… నిద్రిస్తున్న దేశాన్ని జాగృతం చేసి…
కాలినడకతో దేశాన్ని చుట్టేసి…
జాతికి వరం శాంతి మార్గంలో పయనించి… సత్యాగ్రహం అనే స్ఫూర్తిని నింపిన మార్గదర్శి నీవు… సహనశీలి నీవు.. శాంతిదూత నీవు… వందనం మహాత్మ.. సందులలోని విగ్రహాలు.. కరెన్సీ నోట్ల మీద నీ ప్రతిమలు..
కార్యాలయాలు లోని చిత్రాలు…
జాతి మొత్తం నీ నామ స్మరణ…
ఆ సత్యం తో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయం మేలని చాటిచెప్పిన బాపూ..
ఎంత గొప్పగా జీవించాను చేతులు చెప్పాలి…
ఎంత గొప్పగా మరణించా మో ఇతరులు చెప్పాలని చాటారు బాపూజీ… మానవత్వం పై విశ్వాసం కోల్పోకూడదు… మానవత్వం ఒక మహా సముద్రం…
ఆలోచనలు ఉన్నతంగా ఉంటే అవి మాటల్లో ప్రతిబింబిస్తాయని…
శారీరక సామర్థ్యం నుండి బలం రాదని సంకల్పం నుండి వస్తుందని…
చెడు నిర్మూలించాలంటే ఆయుధాలు పడితే జరిగేది రెండు దుష్టశక్తుల మధ్య యుద్ధమే అని..
ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు కానీ కోర్కెలను కాదని.. మనం మనకోసం చేసేది మనతోనే అంతరించి పోతుందని…
ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుందని… నిజాన్ని దైవంగా భావించి.. సత్యమేవ జయతే అని చాటిన బాపూజీ మనకు ఎన్నటికీ ఆదర్శవంతమైన స్ఫూర్తి ప్రదాత…