చల్లని నీడ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సావిత్రి కోవూరు
చల్లని నీడ ఇచ్చు తరువులనన్నింటిని కఠినముగా నరుకుతు పోతే,
ఇంగిత జ్ఞానం లోపించిన మనిశ గాంచి విలవిలలాడే ప్రకృతి
హరితమన్నది అదృశ్యం అవ్వగా
నరుని అజ్ఞానానికి ఆక్రోశించెను అవని.
భవితవ్యం యోచన చేయక పచ్చని తరువు లన్నింటిని
నరుకుతు పోతూ భావితరాలకు నీరు , నీడ అదృశ్యం చేస్తే,
ఎవరి స్వార్థం వారిదే అయితే ప్రకృతి ప్రకోపించు, భూగోళమే అగ్నిగుండమై,
అగ్ని జ్వాలలు విరజిమ్ము, అవనినంతటిని భస్మీపటలం చేయు,
పవిత్ర జలమే తుఫానుగా మారి ధరిత్రినంతా ముంచెత్తు,
వాయువే సుడి గాలిగా మారి నిలువనీడను కూల్చివేయును
భూమాతే పక్కున పగిలి జనుల ప్రాణములు హరించి వేయు
ప్రాణ వాయువే విషవాయువుగ మారి జీవహననం గావించదా
పచ్చని చెట్లను ఎన్నింటినో నాటి, చల్ల ధనమును కాపాడి, భూమాతకు శాంతిని గూర్చి
అమృతజలమును పదిలం చేసి, సకల ప్రాణులను రక్షించు, భావితరాలకు అందించు.