మనసు
సావిత్రి తోట “జాహ్నవి”
మనిషి మనిషికి మారేది
చూసే కనులకే తెలిసేది
మనసున్న మారాజులు గ్రహించేది
మనసులేని వారికి అందనిది
సప్తవర్ణాల హరివిల్లును తలపించేది
ప్రకృతి రమణీయతకు మారుపేరది
ఆస్వాదించే మనసుకీ మరింత దగ్గర చేర్చేది
అందమా నీ చిరునామా ఎక్కడా!?
అంటే ఏమని చెప్తుంది!!
అందమైన మనసుకి
తోడు నీడనై నిలుస్తానంటుంది.
నీ కళ్లకు కనబడను…
కాని, నీ మనసుకి కనిపిస్తానంటుంది…
నీలో అణువణువు నా ఉనికిని చాటి…
మరో స్వర్గం చూపిస్తానంటుంది…
కళ్లున్న కబోది కన్న…
కళ్లు లేని మారాజులే నా ఉనికిని సులువుగా గుర్తించగలిగితే…
కళ్లతో కన్న మనసుతో ఆస్వాదిస్తే…
నీవు కోరుకున్న అందం …
నీకు తోడునీడై నిలవకపోతే అడుగు అంటుంది