అంశం: నేనో వస్తువుని
మర మనిషి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : చింతా రాంబాబు
రక్తమాంసాలతో నిండిన నా శరీరం
స్వార్ధం, కుళ్లు,కుతంత్రాలతో నిండి
స్వలాభం కోసం ప్రాకులాడుతూ..
పక్కవారితో పనేంటని….
ప్రేమానురాగాలను పక్కనపెట్టి
జాలి,దయ గుణాలను గాలికి వదిలి
మనసులేని మనిషి లా
స్పందన లేని హృదయంలా
కట్టుబాట్లను తెంచుకొని
చెడు అలవాట్లను పెంచుకొని
స్వేచ్ఛను కొనుక్కొని
మనసులేని మరమనిషిగా జీవిస్తూ
నేనొక వస్తువుగా
మారిపోయాను
ఈ బిజీ సమాజంలో…