నన్ను కన్న తల్లివేనమ్మా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
చిట్టితల్లి లక్ష్మిని ఆశీర్వదిస్తు.. మీ నాన్న రామయ్య వ్రాయునది. నీవు నా దగ్గరకి పుష్కర కాలం తరువాత వచ్చి ఆప్యాయంగా నన్ను కన్నతల్లిలా చెప్పిన విషయం ఈ వారం అంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నీవు నన్ను, అమ్మని కాదని కులాంతర వివాహం చేసుకుంటే, పరువు కోసం మేమిద్దరం ఒకే సంతానం అయి అపురూపంగా చూసుకున్న నిన్ను కాదని సమాజమేమంటుందో అని వదిలి రోజు..నీ జ్ఞాపకాలనే తలచుకుంటు గడిపాము. నీవు వ్రాసిన ఉత్తరాలకు కూడా జవాబు ఇవ్వలేదు. అమ్మ చెప్పినా.. నా మూర్ఖత్వంతో వినలేదు. అమ్మ ఆ బెంగతోనే పోయినా..నీకు చెప్పక పోతే, మద్రాసులో ఉన్న నీవు ఆరు నెలల తరువాత మొన్న భర్తతో వచ్చి నాన్నగారు మిమ్మల్ని తీసుకు వెళతాము. మీ అమ్మలా నేను చూస్తాను అని నీవు.. అల్లుడు మోహన్ మీరు నా తండ్రిలాంటి వారు తప్పక కంటికి రెప్పలా కాపాడుతాను ఎంతమందికో పాఠాలు చెప్పిన మీకు చెప్పేటంతవాడిని కాదు.”మానవత్వమే మాధవత్వం. కులమతాలు మనం సృష్టించుకున్నవే కదా! ఆలోచించుకోండి అన్నారు”. ‘అపుడు చెప్పక పోయిన నేను ఆలోచిస్తే వయసు పెరిగింది కానీ పరిణితిలో మీరే గొప్ప అనిపించింది’. లక్ష్మి నీవు ఎంత ఎదిగి పోయావు. నిజమే నా కన్నతల్లి నీలో కనిపించింది. ఈ జీవిత చరమాంకంలో మీతోనే ఉండడానికి నిశ్చయించుకున్నాను. “ధీర్గ సుమంగళీ భవ”.
ప్రేమతో
మీనాన్న రామయ్య.