కరోన ప్రేరణ కవిత
రచయిత::నరసింహారావు కాసీమల్ల( అక్షరపద్మ )
మేలుకో….!
“భారతీయుడా”
మేలుకో…!
“జన జీవన స్రవంతిని సరైన మార్గాన నడుపుటకు నడుంకట్టి,
ఆవేశాన్ని పిడికిట బిగించి, మార్పుకోసం సమాజాన్ని చైతన్యం చేయి”…!
“పొరుగు దేశాల నీచమైన ఆకృత్యాలకు తల్లడిల్లుతున్న
నీ భరత జాతి సౌభాగ్యం కోసం జన జాతిని జాగృతం చేయి”….!!
” నీ శ్రేయస్సు కొరకు కంటికునుకు మరచి పోరాడే వైద్యులకు “,,,
” కాచి కాపాడే ఖాకీల పోరాటానికి ” తోడుగా మేము సైతం అంటూ,
సమాజ శుద్దికి కంకణం కట్టిన ” పారిశుధ్య కార్మికుల సేవ ” ను మరచి,,,
సొంత లాభముకై ఏల…?
నీ పరుగు “….!!
” చీకటి తెరలను చీల్చి,,
సామాజిక దూరంతో స్వీయ నియంత్రణ పాటించు “….!
” కాదని ”
” కాలు బయట పేట్టినచో,
కరోన నీ చితికి కట్టెలు పేర్చునని మరువక,
దేశ ఐక్యతను ఏకతాటిపై నడిపేందుకు,
నడుంకట్టి,
నిజమైన భవితకు బాటలు వేయుటకు మేలుకోవోయ్ భారతీయుడా”….!!!
” మేలుకో “…!!!!!