కూర తెలగపిండి – కందిపప్పు పొడి కూర
రచన :: కృష్ణవేణి
కావాల్సిన పదార్థాలు::
కూర తెలగ పిండి – 1/4 kg (or) 1/2 kg.
కందిపప్పు – ఒక చిన్న గ్లాసు (తెలగపిండికి సరి పడినంత).
నూనె – 2 గరిటెలు ( కొంచెం ఎక్కువే).
పోపు గింజలు – పచ్చి శనగపప్పు , మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ.
వెల్లుల్లి పాయలు – 2 ( పొట్టు తీసి, రెబ్బలు రెడీ చేసుకోవాలి )
ఉప్పు, కారం – రుచికి సరిపడా
తయారు చేసే విధానం::
- ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, ఒక గిన్నెలో కందిపప్పు కడిగి, ఒక గ్లాస్ నీళ్ళు పోసి 10 నిమిషాలు కందిపప్పు ఉడికించాలి.
- కొంచెం మెత్తబడిన కందిపప్పును ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. (ఆ మిగిలిన నీరు కూడా కందికట్టు చారుగా వాడుకోవచ్చు.)
- మళ్లీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, రెండు గరిటెల నూనె పోసి, వేడి చేసుకోవాలి.
- నూనె వేడి అయ్యాక, పచ్చి శనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఆయిల్ లో బాగా వేగనివ్వాలి. కొంచెం ఇంగువ కూడా ఆ పోపు గింజలలో వెయ్యాలి.
- ఎర్రగా వేగిన పోపు గింజల్లో, ముందుగా ఉడికించిన కందిపప్పుకు సరిపడినంత తెలగ పిండి తీసుకుని, ముందుగా కందిపప్పు, తర్వాత ఆ పిండి కలుపుతూ వెయ్యాలి. రెండూ కలిపి పాన్ లో ఒక 10 నిముషాలు ఉడికించాలి. ( మూతపెట్టకూడదు)
- ఉడికించిన పిండి, కందిపప్పులో కలసి పొడిపొడిగా కూర రెడీ అవుతుంది. ఉప్పు, కారం, మళ్లీ లేత కరివేపాకు వేసి, బాగా కలియబెట్టాలి.
- 3 నిముషాలు స్టవ్ మీద ఉంచి, స్టవ్ ఆప్ చెయ్యాలి. వేడి వేడి తెలగ పిండి కూర రెఢీ.
- తరిగిన కూర వద్దు అనుకున్న రోజున, మనకి ఈ కూర మహా ప్రసాదం అవుతుంది.
***