పరిమళించిన మానవత్వం
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)
రచన: కార్తీక్ దుబ్బాక
భరతుడు పాలించిన రాజ్యంలో ఇప్పుడు చెడు కాలం దాపురించింది. చెడు గాలులు వీస్తున్నాయి, ఆ గాలిలో కరోనా, అనే కంటి కి కనిపించని పురుగు మనుషులు నోరు, ముక్కు నుండి, మనిషి లో ప్రవేశించి ,ఎన్నో ప్రాణాలుని గాలిలో కలిపింది.
ఫలితంగా ప్రపంచం మొత్తం అల్ల కల్లోలం లో ఉంది. ప్రజలు భయ బ్రాంతులకు గురిఅయి, ఎన్నోబాధలు పడుతున్నారు. పట్నాలు నుండి గ్రామాల కు విజ్రుంబించింది. ప్రజలకు సొంత గ్రామాలు పోవడానికి అవకాశం లేకుండా
ప్రయాణం సాధనాలు, రద్దు చేసాయి ప్రభుత్వాలు, కూలిపనివాళ్ళు, దూర ప్రయాణాలు చేసి, పొట్ట చేత పట్టుకొని పనులు లేక లాక్ డౌన్ లో దరిధ్రం అనుభవిస్తూ జీవనం గడుపు తున్నారు. ఆఫీస్లు, షాపులు, హోటల్లు ప్యాక్టరిలు మూత పడ్డాయి, జనజీవనంఅస్తవ్యస్తం, కాలి నడకన వందల కిలోమీటర్లు మండు టెండలో ప్రయాణం చేసి సొంత గ్రామాలు చేరుకొనే ప్రయత్నంలో వందల మంది ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ప్రజలు, ముఖ్యంగా కూలీలు, వలసజీవులు,
దీనులయి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, ఆహరం కోసంచంటి పిల్లలుతో ఎదురు చూస్తున్నారు.
ఇటువంటి విపత్కర పరిస్థితులును మునుపెన్నడు చూడని ప్రజలు ఎంతో మంది ఆనాధలుగా మరణించారు. ఆసుపత్రులు శవాలా దిబ్బలుగా మారాయి. ఈ స్థితిలో మనసున్న, మానవత్వం ఉన్న మహానుభావులు ఎంతోకొంత సహాయం తనవంతుగా చేయడానికి ముందుకి వచ్చి, ఆపన్న హస్తం అందించి మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారని నిరూపించుకున్నారు.
ప్రభుత్వంలు కొంతసహాయం చేసిన, అది అందరికి చాల్క ఇబ్బందులు పడుతున్నప్పుడు చూసి చలించి పోయిన ధర్మం, అనే ధర్మధాత ప్రజలను ఆదు కోవడానికి ముందుకొచ్చాడు, ఆదుకున్నాడు. దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లకి రవాణా సౌకర్యాలు కల్గించాడు. చిన్న పిల్లలుకు వైద్యం చేయించాడు, దూర దేశాలలో ఉన్న వాళ్ళుకి వాయు మార్గం లో తన దేశానికి రప్పించాడు. ప్రజల హృదయాలలో దేవుడై నిలిచి పోయాడు, ధర్మం.
ఎక్కడో పుట్టిన, వలస జీవుల బ్రతుకుల్లో వెలుగులు నింపి సాధారణ వ్యక్తిగానే సేవలందించి, మహాత్ముడు అని పిలిపించుకున్నాడు, ధర్మం. ధర్మం, పేరుకు తగ్గ మనిషి అనిపించుకున్నాడు.. ప్రజల నాల్కల్లో నాలుక అయినాడు. మానవత్వం పరిమలించిన మానవుడు, మహనీయుడుగా పేరు పొందినాడు, బాధల్లో ఉన్న ప్రజలకు ఎవరు చేయలేని, చేయని సహాయం చేసిన మహారాజుగా వెలుగుతున్నాడు ధర్మం నేడు….
(పేరు మార్చినాను, ధర్మం అని )
//సమాప్తం //