మడత పూరి
రచన :: నారుమంచి వాణి ప్రభాకరి
మడత పూరి తయారీ కి కావలసిన పదార్థాలు ::
మైదా – 1/4 కిలో
ఉప్పు – చిటికెడు
పంచదార – 1 కప్పు
నెయ్యి – 1/2 కప్పు
బియ్యం పిండి – 1/4 కప్పు
తయారీ విధానము::
- ముందుగా మైదాకు ఉప్పు రెండు చెంచాల నెయ్యి వేసి చపాతీపిండిలా కలిపి రెండు భాగాలుగా విడి విడిగా చేసుకోవాలి
- మిగిలిన నెయ్యిలో బియ్యం పిండి కలిపి క్రీమ్ లాగా చేసి ఉంచుకోవాలి
- పెద్దగా పూరి వత్తి దానిపై ఈ క్రీమ్ రాసి చుట్టలా చుట్టుకొని, ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఒక్కొక్క ముక్కను పురిగా వత్తుకోవాలి..
- ఓవెన్ ఉంటే అందులో ప్లేట్ లో పెట్టి ఓవెన్ లో పెట్టాలి .(లేదా)
- బాండీలో ఓ పావు కిలో నూనె కాచి అందులో వేయించి పక్కన పెట్టాలి .
- ఇప్పుడు పంచదార పాకం పట్టి అందులో ఈ పూరి వేసి తీసి పక్కన పెట్టాలి.
- ఎంతో సులభంగా చేసుకునే రుచికరమైన మడతపూరి రెడీ..
- మరి ఇంక ఆలస్యం ఎందుకు మీరు తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు…
ఈజీ గా ఉంది మేడం చెయ్యటం…👌👌