మనిషి- ప్రకృతి
రచన: నేతి కార్తిక్
మట్టితో చేసేవారు వినాయకుల తయారి,
మనిషి ఆలోచన మారి,
ఢాంబిక ప్రవర్తనను కోరి
పీ.ఓ.పీలతో చేయడం మొదలెట్టిరి ,
గొప్పలు చూపేందుకు పెంచుతుపోతున్నారు పరిమాణాలు,
వాటి నిమజ్జన వేళ రసాయనాలు చేరి,
జలమును గరళము చేసిరి,
ఆడంబరాలకు బాణాసంచాలు పేల్చిరి,
ప్రకృతికి చేటు తెచ్చిరి,
పండుగల పద్ధతి మార్చిరి,
గాలిలో కర్బన మూలకాలు పెంచిరి,
ఈ-మానవుల చేస్తున్న వెర్రి చేష్టలకు
బలి అవుతున్నాయి మూగజీవాలు, పచ్చని కానలు, భావితరాలు.
ఇకనైనా మారాలి మనం చెయ్యాలి భూమిని భవితకు స్వర్గం.