(అంశం: “ఏడ తానున్నాడో”)
మనసు నాకు తెలుసు
రచన: కృష్ణకుమారి
“బావా రావా?” మరదలి పిలుపులకి అంతూ లేదూ,
కార్చే కన్నీటికి అదుపూ లేదు…
‘ఏడ ఉన్నాడో తెలీదు, చెప్పడు
సెల్ యుగంలో ఫోనే దొరకదు!
కఠినాత్ముడు నీ తండ్రిని ఒప్పించిందికే ఈ సైన్యం లో చేరేడని,
చేరిన తరవాత మన ప్రేమకన్నా, దేశమాత సేవే గొప్పదని
మనసా వాచా ఒప్పేసుకున్నాడని
అయినా తొందరలోనే బావ వస్తాడని, ఈ చిన్నారి మరదలికి చెప్పేదెవరని?
నీలిమేఘం గర్జించి చెప్పింది,
కేకి పురివిప్పి నాట్యమాడుతూ
కేకలు వేసింది..
మరదలు మనసు మయూరమై గెంతింది.. ఏరవాక
బావరాక ఒక్కసారే జరిగింది!