ఏవో కొంచెం
రచన: కృష్ణకుమారి
వకుళ పక్కింటి జ్యోతి కనపడితే పలకరించింది. “ఏం,జ్యోతీ ఈసారిదీపావళికి ఎలా మరి”?
జ్యోతి అత్తగారు చనిపోయి రెండు నెలలయింది. కర్మకాండలు అన్నీ జ్యోతి పెద్ద బావ గారింట్లో అందరూ చేసేరు. అన్ని బాధ్యతలూ తీరిన తరవాత మరణం ఏమో ఆ పదిరోజులూ అయిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళి రొటీన్ లో పడ్డారు.
“ఏం చేస్తాం వకుళా! మాకు ఈ ఏడాది అంతా పండగలు లేవు కదూ! ఏం చేయడం”
జ్యోతి చిన్న కొడుకు బుజ్జి అఖండుడు. వాడికి వాళ్ళమ్మ చుట్టుపక్కల ఆడవాళ్ళతో మాడాడుతూ ఉంటే వినడం మహా ఇష్టం.
చటక్కున అన్నాడు. ” ఆంటీ, ఏవో కొంచెం చేగోడీలు మాత్రం చేసింది మా అమ్మ ! మరే కొంచెం సేమ్యా చేస్తున్నాది”
వకుళ మొహం చూడాలంటే భయం తో లోపలికి వెళ్ళింది జ్యోతి. వెనకాలే వెళ్ళిన బుజ్జాయి గాడి వీపు మీద రాత్రి పేలాల్సిన పటాకీలన్నీ పేలేయని వేరే చెప్పాలా?