అంశం::(“ఊహలు గుసగుసలాడే”)
వలదన్న వినదీ మనసు!
రచన: బిహెచ్.వి.రమాదేవి
నిన్ను వదిలి చంద్రమండలం దాకా పరుగు తీశాను!
జాబిల్లివై కొంటె నవ్వుతో నీవు!
నీ కుదూరం గా సుదూరంగా
వెళ్లిపోవాలని చేరాను!
ప్రతి మాటలో నీ జాడలే!
నీ వైపు చూడ కూడదను కునీ
పారిపోయాను గిరుల వైపు,
ప్రతికొండగాలిలోఈలతోనువ్వు
ఏతోటలో నో, యే చోటులోనో
దాగుందామని వెళ్ళాను,
ప్రతి పువ్వులో గుస గుస గా
నీ నవ్వుల మాయాజాలం!
సిరిమల్లె చూసినా నీవే,
విరి బాలతల వూచినా నీవే!
ఒక గీతిక విన్నా నీవే,!
ఒక వేణువు విన్నా నీవే!
వేదన లోనూ, మోడం లోనూ,
వేకువలోనూఏ కువకువలోనూ
నువ్వేవినిపిస్తూ,నువ్వేకనిపించి
కనికరించని , సుస్వరంలా
నీవే నవరస భరిత మైతే,
నేనువినూత్నచరితనై, మోస్తున్నా! విషాదాన్ని,
శిలువ కనబడని క్రీస్తులా,
నీనాథునిలా, శ్రీనాథునిలా!
నీ సన్నిధిని చేరేపెన్ని ధిలా
నిను చేరుకునే వరకు,
వలదన్న వినదే మనసు!
కలనైన నిన్నే తలచు,!
***